ETV Bharat / bharat

ప్రేయసితో కలిసి కిడ్నాప్ డ్రామా.. సొంతింటి నుంచే 25లక్షలు..

author img

By

Published : Jul 2, 2021, 7:30 PM IST

అప్పులు తీర్చేందుకు కిడ్నాప్ డ్రామాకు తెరతీశాడో వ్యక్తి. తనను అపహరించారని నాటకం ఆడాడు. ప్రియురాలితో కలసి ఏకంగా తల్లితండ్రుల వద్దే డబ్బులు రాబట్టే పన్నాగం పన్నాడు. దిల్లి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఈ ఘటనలో చివరకు ఏమైందంటే..

FAKE KIDNAPPIN
కిడ్నాప్ అయ్యానంటూ సొంతింటికే ఫోన్.. రూ.25లక్షలు డిమాండ్!

ఊరినిండా అప్పులు చేసిన 28 ఏళ్ల వ్యక్తి.. అవి తీర్చేందుకు తాను కిడ్నాప్​ అయినట్లు నాటకం ఆడాడు. తల్లిదండ్రుల వద్ద నుంచే రూ.25 లక్షలు వసూలు చేసేందుకు సిద్ధమయ్యాడు. సహోద్యోగి భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న అతను.. ఆ మహిళతో కలసి ఈ కిడ్నాప్​ కుట్రకు తెరలేపాడు.

పార్టీ నుంచి మాయం..

హరియాణా పానిపట్​లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న తన కుమారుడు గత నెల 25న దిల్లీ రోహిణీ ప్రాంతంలో ఒక పార్టీకి హాజరైన రోజు నుంచి కనిపించట్లేదని కిడ్నాప్​కు గురైన వ్యక్తి తండ్రి ఫిర్యాదు చేశాడు. దీనిపై ఐపీసీ 356 సెక్షన్​ ప్రకారం కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ ఆధారంగా ఆ వ్యక్తి చివరిసారిగా సెక్టార్ 22 వద్ద ఓ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించారు.

మహిళతో ఫోన్..

ఈ క్రమంలో.. కిడ్నాప్ అయిన వ్యక్తి తల్లిదండ్రులకు జూన్ 28న ఓ మహిళ నుంచి ఫోనొచ్చింది. వారి కొడుకు పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయాడని.. అవి తీర్చేందుకు వెంటనే రూ.25 లక్షలు పంపాలని ఆమె చెప్పింది. అయిదు అకౌంట్ నంబర్లు ఇచ్చి.. డబ్బు జమ చేయాల్సిందిగా కోరింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. సదరు మహిళ ఆగ్రా సమీపంలోని తుండాలా అనే ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.

విచారణలో భాగంగా తమదైన శైలిలో ప్రశ్నించగా.. కిడ్నాప్​ అయిన వ్యక్తి రిషికేశ్​లో ఉన్నట్లు ఆ మహిళ తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.