ETV Bharat / bharat

పడవ ప్రమాదంలో 9 మంది మృతి

author img

By

Published : Jul 15, 2021, 4:04 PM IST

Updated : Jul 15, 2021, 4:32 PM IST

బంగాల్​లో బుధవారం జరిగిన పడవ ప్రమాదంలో 9 మంది మరణించారు. పడవ నడుపుతున్న ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. గల్లంతైన మరొకరి కోసం అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు.

BENGAL CAPSIZE
పడవ ప్రమాదంలో 9 మంది మృతి

మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యాలు

బంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో బుధవారం జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన 9మంది మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. బక్‌కాలీ తీరంలో ఉన్న రక్తేశ్వరీ దీవి వద్ద బుధవారం.. హైమావతి అనే పడవ ప్రమాదానికి గురైంది. చేపలు పట్టిన అనంతరం తిరిగి వస్తున్న సమయంలో భారీఎత్తున అలలు ఎగసిపడటం వల్ల పడవ మునిగిపోయింది.

BENGAL CAPSIZE
సహాయక చర్యలు
BENGAL CAPSIZE
.

ఒక్కసారిగా అలలు విరుచుకుపడగానే.. పడవ నడుపుతున్న ఇద్దరు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో మిగతా వారు నిద్రిస్తున్నారని వెల్లడించారు. నిద్రలోనే 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. గల్లంతైన ఓ వ్యక్తికోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: 'మూడో దశ ఎప్పుడని చెప్పలేం.. సిద్ధంగా ఉండాలి'

Last Updated : Jul 15, 2021, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.