ETV Bharat / bharat

లారీని ఢీ కొట్టి జీపు బోల్తా- ఏడుగురు మృతి

author img

By

Published : Sep 12, 2021, 6:39 PM IST

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు చిక్కబళ్లాపుర్​లోని చింతామని తాలుకాలో ఆంధ్రప్రదేశ్​-బెంగలూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

jeep collides with lorry
లారీని ఢీ కొట్టి జీపు బోల్తా

కర్ణాటక చిక్కబళ్లాపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జీపు లారీని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చింతామని తాలుకాలో ఆంధ్రప్రదేశ్​-బెంగళూరు జాతీయ రహదారిపై మదికేరే క్రాస్​ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

శ్రీనివాసపుర్​ తాలుకాలోని రాయల్​పాడు గ్రామం నుంచి జీపు చింతామనికి వైపునకు వస్తున్న క్రమంలో లారీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలంలోనే ఆరుగురు మృతి చెందగా.. ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.

jeep collides with lorry
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన జీపు
jeep collides with lorry
ప్రమాద స్థలంలో పడి ఉన్న మృతదేహాలు

ఇదీ చూడండి: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. సుత్తితో బెదిరించి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.