ETV Bharat / bharat

మహారాష్ట్రలో ఒక్కరోజే 66,159 మందికి కరోనా

author img

By

Published : Apr 29, 2021, 9:59 PM IST

Updated : Apr 29, 2021, 10:18 PM IST

corona cases
మహారాష్ట్రలో కరోనా కేసులు

దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే 66,159 మందికి కరోనా సోకింది. ఉత్తర్​ప్రదేశ్​లో 31,156 మంది వైరస్ బారిన పడ్డారు. కేరళలో 38,607 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

దేశంలోని వివిధ రాష్ట్రాలలో కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే 66,159 మందికి కరోనా సోకింది. 771 మంది మృతి చెందారు. ఒక్క ముంబయిలోనే 4,192 మంది వైరస్ బారిన పడ్డారు.

ఉత్తర్​ప్రదేశ్​లో లో 31,156 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. 298 మంది వైరస్​ ధాటికి బలయ్యారు.

వివిధ రాష్ట్రాలలో ఒక్కరోజులో నమోదైన కరోనా కేసులు

రాష్ట్రం కరోనా కేసులు మరణాలు
తమిళనాడు 17,858 107
బంగాల్17,403 89
కేరళ 38,607 48
రాజస్థాన్ 17,269 158
గుజరాత్ 14,327 180
మధ్యప్రదేశ్ 12,762 95
హరియాణా 13,947 97

ఇదీ చూడండి: హోం ఐసోలేషన్ కొత్త మార్గదర్శకాలు ఇవే!

ఇదీ చూడండి: ఒకే గదిలో వందకు పైగా కరోనా రోగులు!

Last Updated :Apr 29, 2021, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.