ETV Bharat / bharat

చిరుతతో 65 ఏళ్ల వృద్ధుడి యుద్ధం.. కూతురి కోసం అడవి పందితో పోరాడి తల్లి మృతి

author img

By

Published : Feb 27, 2023, 9:31 PM IST

చిరుతతో భీకరంగా పోరాడాడు ఓ 65 ఏళ్ల వ్యక్తి. ప్రస్తుతం తీవ్రగాయలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బంగాల్​ ఈ ఘటన జరిగింది. మరోవైపు కూతురి కోసం అడవి పందితో పోరాడింది ఓ తల్లి. ఘటనలో తల్లి మృతి చెందగా కూతురు ప్రాణాలతో బయటపడింది.

65-yr-old-nar-bahadur-a-real-bahadur-fights-leopard-and-survives-in-darjeeling
చిరుతతో పోరాడిన 65 ఏళ్ల వృద్ధుడు

ఓ 65 ఏళ్ల వ్యక్తి చిరుతను ఎదిరించాడు. దానితో భీకరంగా పోరాడాడు. చిరుత విసిరిన పంజాను ఎదుర్కొని.. ప్రాణాలతో నిలబడ్డాడు. ఆరు పదులో వయసులో పులితో పోరాడి.. ప్రస్తుతం తీవ్ర గాయలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బంగాల్​లో ఈ ఘటన జరిగింది. బహదుర్ రాయ్ అనే వ్యక్తి ఈ సాహసం చేశాడు.

పొలంలో ఉండగా చిరుత దాడి..
బహదుర్ రాయ్ డార్జిలింగ్​ జిల్లాకు చెందిన వ్యక్తి. మిరిక్ తారాబరి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. శనివారం రాయ్​.. పూల మొక్కల తోటలో గడ్డిని కోస్తూ ఉన్నాడు. అదే సమయంలో పక్కనే పొదల్లో నుంచి హఠాత్తుగా ఓ చిరుత పులి రాయ్​పై దాడి చేసింది. దీంతో భయపడిపోయిన రాయ్​.. మొదట దాని నుంచి తప్పించుకునే ప్రయత్న చేశాడు. ఆ తర్వాత రాయ్​.. దానికి ఎదురుతిరిగాడు. చిరుతతో తన శక్తి మేర పోరాడాడు.

రాయ్​ అరుపులు విన్న చుట్టుపక్క రైతులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. పులిని అక్కడి నుంచి తరిమేశారు. తీవ్రంగా గాయపడ్డ రాయ్​ను.. స్థానిక ఆసుపత్రికి తరిలించారు. మెరుగైన చికిత్స కోసం నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ అండ్​ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. చిరుత ఆహారం కోసమే అడవి నుంచి బయటకు వచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కొన్నేళ్లుగా అడవుల్లో చిరుతల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందన్నారు.

కూతురి కోసం అడవి పందితో పోరాడి ఓడిన తల్లి..
కూతురిని కాపాడేందుకు తన ప్రాణాలనే అడ్డేసింది ఓ తల్లి. అడవి పందితో విరోచితంగా పోరాడి.. కూతురిని రక్షించింది. తాను మాత్రం ప్రాణాలను పోగొట్టుకుంది. ఛత్తీస్​గఢ్​లో ఈ విషాదం జరిగింది. ఆదివారం ఘటన జరిగినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

కోర్బా జిల్లా, పసన్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని తెలియమార్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలిని దువాషియా భాయి(​45)గా పోలీసులు గుర్తించారు. దువాషియా, తన కూతురు రిం​కీని వెంట తీసుకుని మట్టి కోసం దగ్గర్లో ఉన్న పొలానికి వెళ్లింది. పారతో మట్టిని తవ్వుతుండగా హఠాత్తుగా వారిపైకి అడవి పంది వచ్చింది. రిం​కీపై పంది దాడి చేసింది. దీంతో కూతురిని కాపాడేందుకు.. అడవి పందిని ఎదుర్కొంది దవాషియా. తన దగ్గర ఉన్న గొడ్డలితో దానిపై దాడి చేసింది. రిం​కీ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుంది. అయితే, అడవి పంది దాడిలో తీవ్రంగా గాయపడ్డ దువాషియా.. చివరకు ప్రాణాలు కోల్పోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.