ETV Bharat / bharat

మూడు వాహనాలు ఢీ.. నలుగురు దుర్మరణం

author img

By

Published : May 30, 2022, 2:23 AM IST

Accident: రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Accident:
Accident:

Rajasthan accident: రాజస్థాన్​లోని ప్రతాప్​గఢ్​ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఏడుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని చిత్తోర్‌గఢ్-ప్రతాప్‌గఢ్ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. ఒక ట్రక్కు, కారు, జీపు ఒకదానికొకటి ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

కారులో ప్రయాణిస్తున్న దశరథ్ (25), పరీబాయి (70), నిహాల్ (4), నెల వయసున్న చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా, జీపులో ఉన్న మరో ఏడుగురికి గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, మూడు వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి: యువకుడిపై లైంగిక దాడి.. నిందితులిద్దరూ యువకులే

పానీపూరీ బండిపైకి దూసుకెళ్లిన స్కార్పియో.. బాలుడు సహా ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.