ETV Bharat / bharat

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. నలుగురు మృతి

author img

By

Published : Feb 13, 2022, 11:01 AM IST

accident today
road accident in odisha

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.

Accident In Odisha: ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి చెందారు. కంధమాల్​ జిల్లా ఫూల్బనీ సదర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని లహాబడిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వస్తోన్న ట్రక్కును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది.

ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. బిసిపాడలోని తమ బంధువుల ఇంటిలో శుభకార్యానికి హాజరై గుమ్మగదకు తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. 9 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.