ETV Bharat / bharat

గుజరాత్​లో స్వల్పంగా కంపించిన భూమి

author img

By

Published : May 17, 2021, 10:01 AM IST

గుజరాత్​లో భూకంపం, gujarat earthquake
గుజరాత్​లో భూకంపం

గుజరాత్​లోని సోమనాథ్​ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

గుజరాత్​లోని గిర్​ సోమనాథ్​ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున 3.37 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్​ స్కేల్​పై తీవ్రత 4.5గా నమోదైనట్లు ఆ రాష్ట్ర భూ విజ్ఞాన కేంద్రం తెలిపింది.

జిల్లాలోని ఉనా, గిర్​, సుత్రపదా, దియు ప్రాంతాల్లో భూకంపం ప్రభావం ఉన్నట్లు సమాచారం.

అయితే భూకంపం వల్ల ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం కలగలేదని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : గుజరాత్​ వైపు 'తౌక్టే'- ముంబయిలో ఆరెంజ్ అలర్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.