ETV Bharat / bharat

ఆ జవాన్​ హత్యకు ప్రతీకారం​- ముగ్గురు ఉగ్రవాదులు హతం

author img

By

Published : Jun 12, 2022, 9:13 AM IST

Encounter In Kashmir
Encounter In Kashmir

Encounter In Kashmir: కశ్మీర్​లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య శనివారం ఎన్​కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ముగ్గురు ముష్కరులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు.

Pulwama Encounter news: జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చాయి. ద్రాబ్​గామ్​ ప్రాంతంలోని ముష్కరులు ఉన్నట్లు శనివారం నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, సాయుధ దళాలు కలిసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి.
"ఆయుధాలు, మందుగుండు సామగ్రి తదితర వస్తువలను స్వాధీనం చేసుకున్నాం. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నాయి. హతమార్చిన వారిలో ఒకరు జునైద్ షీర్గోజ్రీగా గుర్తించాం. మే 13న జవాన్​ రియాజ్​ అహ్మద్​ను హతమార్చడంలో అతడి ప్రమేయం ఉంది" అని జమ్ముకశ్మీర్ ఐజీపీ తెలిపారు.

ఇవీ చదవండి: రాజ్యసభ ఫలితాలతో భాజపాలో జోష్​.. రాష్ట్రపతి ఎన్నికపై ధీమా

'ఇంకెంత కాలం 'మాజీ'గా ఉంచుతారు?'.. కాంగ్రెస్‌ కీలక నేత వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.