తిమింగలం వాంతితో దందా.. 25కేజీలు సీజ్ చేసిన పోలీసులు.. విలువ రూ.25కోట్లు!

author img

By

Published : Dec 24, 2022, 10:19 PM IST

ambergris smuggling news
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న అంబర్​గ్రీస్ ()

తమిళనాడు తూత్తుకుడిలో రూ.25 కోట్లు విలువ చేసే అంబర్​గ్రీస్​ను(తిమింగలం వాంతి) అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి రూ.25 కోట్ల విలువ చేసే అంబర్​గ్రీస్​ను స్వాధీనం చేసుకున్నారు.

కోట్ల రూపాయలు విలువ చేసే అంబర్​గ్రీస్​ను (తిమింగళం వాంతి) అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు తమిళనాడు పోలీసులు. ఈ క్రమంలో ఆరుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. వీరి నుంచి అంబర్​గ్రీస్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.25 కోట్లు ఉంటుందని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తూత్తుకుడిలోని తిరుచెందూర్​లో ఓ కారులో అక్రమంగా అంబర్​గ్రీస్​ను తరలిస్తున్నారని కులశేఖరపట్నం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కారును అడ్డగించి నిందితుల నుంచి అంబర్​గ్రీస్​ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విరుద్​నగర్​కు చెందిన తంగపాండి, ధర్మరాజ్, కింగ్స్​లే, మోహన్.. తూత్తుకుడికి చెందిన రాజన్​, కారు డ్రైవర్ కరుప్పస్వామిగా గుర్తించారు. మూడు కవర్లలో తరలిస్తున్న అంబర్​గ్రీస్ బరుపు 25 కేజీలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీని ధర మార్కెట్​లో రూ.25 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ క్రమంలో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న అంబర్​గ్రీస్​ను తిరుచెందూరు అటవీశాఖ అధికారులకు అప్పగించారు కులశేఖరపట్నం పోలీసులు.

ambergris smuggling news
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న అంబర్​గ్రీస్

అంబర్​​గ్రీస్ అంటే..
అంబర్​​గ్రీస్ పదార్థం సాధారణంగా తిమింగలం జీర్ణవ్యవస్థలో తయారవుతుంది. అది వాంతి చేసుకున్నప్పుడు, ఉమ్మినప్పుడు బయటకు వస్తుంది. సెంట్లు, పర్​ఫ్యూమ్​ల తయారీలో దీనిని వినియోగిస్తారు. ఒక్క కిలో అంబర్​​గ్రీస్​కు రూ.కోట్లలో ధర ఉంటుంది. ఇండోనేసియా, ఇంగ్లాండ్​లో ఈ పదార్థానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అంబర్​గ్రీస్​ స్మగ్లింగ్​ను 1972 వన్యప్రాణుల చట్టం కింద నిషేధించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.