ETV Bharat / bharat

180గ్రాముల డ్రోన్​- జేబులో తీసుకెళ్లొచ్చట!- ఒక్కసారి రీఛార్జ్​ చేస్తే 25నిమిషాల పాటు గాల్లో చక్కర్లు

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 10:48 PM IST

Updated : Dec 1, 2023, 10:58 PM IST

180 Grams Drone
180 Grams Drone

180 Grams Drone : బెంగళూరు టెక్​ సమ్మిట్​లో 180 గ్రాముల నానో ట్రోన్​ అందరి దృష్టిని ఆకర్షించింది. జేబులో పెట్టుకోగలిగే ఈ అతి తేలికపాటి డ్రోన్​ను ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ సైన్స్​, Vaydyn సంయుక్తంగా తయారు చేశాయి. దాని ప్రత్యేకతలు మీ కోసం.

180 Grams Drone : కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన టెక్ సమ్మిట్‌లో జేబులో పెట్టుకోగలిగే అత్యంత తేలికైన డ్రోన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ సైన్స్​ ఆర్ట్​పార్క్, Vaydyn సంయుక్తంగా ఈ డ్రోన్​ను అభివృద్ధి చేశాయి. ఈ డ్రోన్ సహాయంతో అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచవచ్చని Vaydyn ప్రతినిధి తెలిపారు. ఆర్మీతోపాటు పోలీసులు కూడా ఈ డ్రోన్​ను ఉపయోగించవచ్చని చెప్పారు.

"ఈ నానో డ్రోన్​ను ఎనిమిది నెలల క్రితం రూపొందించాం .ఇది టర్బైన్​ పైపుల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే సులభంగా తొలగించగలదు. దీని బరువు కేవలం 180 గ్రాములు మాత్రమే. డ్రోన్​ను ఒకసారి ఫుల్​ఛార్జ్​ చేస్తే 25 నిమిషాల పాటు పనిచేస్తుంది. సెకనుకు గరిష్ఠంగా 25 మీటర్ల ఎత్తు ఎగురగలదు. ఈ నానో డ్రోన్​ ధర లక్ష రూపాయలు"
-Vaydyn కంపెనీ ప్రతినిధి

ఈ తేలికపాటి డ్రోన్​తో పాటు మరో బుల్లి విమానాన్ని కూడా తయారు చేసింది ఐఐఎస్​సీ. అత్యవసర పరిస్థితుల్లో దీనిని ఉపయోగించి నిత్యావసర వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా తరలించవచ్చు. ఈ విమానం ల్యాండింగ్​ కోసం ఎలాంటి రన్​వే అవసరం లేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అవయవమార్పిడి సమయంలో నగరంలోని ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలించడానికి ఈ విమానం ఉపయోగపడుతుందని వెల్లడించారు.

Bengaluru Tech Summit 2023
180గ్రాముల డ్రోన్​

భారత్​ సైన్యం కోసం 'దక్ష' డ్రోన్-
ఎతైన ప్రదేశాల్లో ఉండే సైనికులకు ఆహారం, ఔషధాలను అందించడానికి దక్ష డ్రోన్​ను చెన్నైలోని అన్నా యూనివర్సిటీ పరిధిలోని మద్రాస్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఏరోనాటిక్స్ విభాగం కొన్నినెలల క్రితం రూపొందించింది. అన్నా యూనివర్సిటీ పరిధి కింద ఉన్న మద్రాస్ కాలేజ్​ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోనాటిక్స్ విభాగం డైరెక్టర్ సెంథిల్ కుమార్ నేతృత్వంలో ఈ డ్రోన్​ను తయారు చేశారు. ఈ డ్రోన్ ముందుగా​ వ్యవసాయ పొలాల్లో పిచికారీ చేయటం, నదీ పరివాహక ప్రాంతాల్లో మైనింగ్, డ్రైడ్జింగ్ పనులను తనిఖీ చేయడం వంటి కార్యకలాపాల్లో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఈ డ్రోన్ 15 కిలోల పేలోడ్​ను 20 కిలోమీటర్ల దూరం వరకు విజయవంతంగా రవాణా చేసింది. హిమాలయాల వంటి పర్వత ప్రాంతాల్లో సైనికులకు అవసరమైన సామగ్రిని రవాణా చేయటంలో డ్రోన్ ఉపయోగపడుతుంది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

స్కూల్​ బ్యాగ్​లో కుర్చీ.. లాక్కెళ్లేందుకు చక్రాలు కూడా.. విద్యార్థిని వినూత్న ఆవిష్కరణ

ఫొటో తీస్తే చాలు.. నోటి క్యాన్సర్​ని గుర్తించే స్మార్ట్​ఫోన్​.. త్వరలోనే అందుబాటులోకి!

Last Updated :Dec 1, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.