ETV Bharat / bharat

మరో విద్యార్థిని ఆత్మహత్య.. 2 వారాల్లో మొత్తం నలుగురు..

author img

By

Published : Jul 27, 2022, 11:32 AM IST

11th grade girl hanged herself after returning from school
11th grade girl hanged herself after returning from school

స్కూల్​ నుంచి తిరిగొచ్చిన బాలిక.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడు విరుధునగర్​లో జరిగింది. రాష్ట్రంలో 2 వారాల వ్యవధిలో నలుగురు బాలికలు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Tamilnadu Students Suicide: తమిళనాడులో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. 2 వారాల వ్యవధిలో నలుగురు బాలికలు తనువు చాలించడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం సాయంత్రం స్కూల్​ నుంచి తిరిగొచ్చిన 11వ తరగతి బాలిక.. ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. ఈ ఘటన విరుధునగర్​ జిల్లా శివకాశిలో జరిగింది. బాణసంచా కర్మాగారంలో పనిచేసే మృతురాలి తల్లిదండ్రులు.. యథావిధిగా మంగళవారం కూడా పనులకు వెళ్లారు. ఇంట్లో బాలిక అమ్మమ్మ మాత్రమే ఉంటుంది. స్కూల్​ నుంచి వచ్చిన బాలిక.. తన అమ్మమ్మ బయటికి వెళ్లిన విషయం గమనించి ఉరేసుకుంది. వచ్చి చూసేసరికి ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. తన మనమరాలు మృతదేహాన్ని చూసి వృద్ధురాలు షాక్​ అయింది. చుట్టుపక్కల వారు వచ్చి.. పోలీసులకు సమాచారం అందించారు. బాలిక మృతదేహాన్ని కిందికి దించి.. పోస్టుమార్టానికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

రాష్ట్రంలో 2 వారాల వ్యవధిలో ఇది నాలుగో ఆత్మహత్య. అంతా టీనేజీలో ఉన్న యువతులే కావడం కలకలం రేపుతోంది. అంతకుముందు కడలూరు జిల్లాలో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. సంఘటనా స్థలంలో 4 పేజీల సూసైడ్​ నోట్​ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సోమవారం తిరువల్లూరు జిల్లాలోని ఓ పాఠశాల వసతి గృహంలో 12వ తరగతి విద్యార్థిని శవంగా కనిపించింది. ఈనెల 13న కాళ్లకురిచి జిల్లాలో కూడా ఓ ప్రైవేటు రెసిడెన్షియల్​ పాఠశాలలో బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతర పరిణామాలు హింసకు దారితీశాయి.

ఇవీ చూడండి: ఒక్క నెల కరెంట్ బిల్లు రూ.3వేల కోట్లు.. ఆస్పత్రిలో ఇంటి ఓనర్​!

మూడు రోజుల క్రితమే పెళ్లి.. కూతురు, అల్లుడిని కొడవలితో నరికి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.