ప్రిన్సిపల్​కు ఎమ్మెల్యే చెంప దెబ్బ.. నెటిజన్లు ఫైర్

By

Published : Jun 21, 2022, 3:16 PM IST

thumbnail

కర్ణాటకలోని జేడీఎస్ ఎమ్మెల్యే ఎం. శ్రీనివాస్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆయన నైపుణ్య అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు మండ్యలోని ఐటీఐ కాలేజ్​కు వచ్చారు. అనంతరం కాలేజీ గురించి వివరాలు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐటీఐ ప్రిన్సిపల్​పై దాడికి పాల్పడ్డారు. సహోద్యోగుల ఎదుటే ప్రిన్సిపల్​ను రెండు చెంపదెబ్బలు కొట్టారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్​గా మారింది. శ్రీనివాస్ 2018వ సంవత్సరంలో మండ్య నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.