'గణేశ్'​ మ్యూజియంలా ఇల్లు.. 600 విగ్రహాలు సేకరించిన భక్తుడు

By

Published : Aug 31, 2022, 4:34 PM IST

thumbnail

సాధారణంగా విఘ్నేశ్వరుడు అంటే అందరికీ భక్తి, ఇష్టం ఉంటుంది. కర్ణాటకలో ఓ వ్యక్తి మాత్రం అంతకుమించి అంటున్నారు. అందుకే తన ఇంటినే గణపతి మ్యూజియంగా మార్చారు. బళ్లారిలోని ఆదర్శ్​ నగర్​కు చెందిన అశోక్​ బచావత్ 21 ఏళ్లుగా గణేశ్ విగ్రహాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన ఇంట్లో దాదాపు 600 ప్రతిమలు ఉన్నాయి. మట్టి, చెక్క, ముత్యాలు, థర్మాకోల్, కాగితం, ఇత్తడి, ఇనుము, వెండి వంటి వాటితో చేసిన అనేక రకాల గణేశ్​ విగ్రహాలు కనిపిస్తాయి. మొదట్లో కుటుంబసభ్యులు ఈ విగ్రహాల సేకరణకు అడ్డుపడినా.. అశోక్​ ఆసక్తిని అర్థం చేసుకుని వారు కూడా అండగా నిలిచారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.