రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీ.. డ్రైవర్​ పరార్​.. బాధితుడు అక్కిడక్కడే..

By

Published : Jun 20, 2022, 2:35 PM IST

thumbnail

Hit And Run Case: మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో హిట్​ అండ్​ రన్​ ఘటన కలకలం రేపింది. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో బాధితుడు అక్కడిక్కడే మృతి చెందాడు. కానీ, డ్రైవర్ మాత్రం​ కారుని ఆపకుండా అతివేగంతో వెళ్లిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు.. కారును వెంబడించారు. కానీ, అతడు చిక్కలేదు. మృతుడ్ని సంతోశ్​ ఠాకూర్​(45)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. ఘటనాస్థలి సమీపంలో సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ద్వారా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.