రెండు కాలేజీల విద్యార్థుల వీరంగం.. రాళ్లు రువ్వుకుంటూ..!

By

Published : Apr 12, 2022, 10:10 PM IST

thumbnail

Students Attacks Each Other: చెన్నైలో రెండు కాలేజీల విద్యార్థులు వీరంగం సృష్టించారు. చెన్నై స్టేట్ కాలేజీ విద్యార్థులు చెన్నై సెంట్రల్ స్టేషన్​లో తిరుపతి ఎక్స్​ప్రెస్​ రైలు ఎక్కారు. రైలులో గొడవ చేయగా.. సహ ప్రయాణికులు చైన్​లాగి రైలు ఆపారు. అనంతరం విద్యార్థులను రైలు నుంచి దించేశారు. అదే సమయంలో అరకోణం రైలులో ప్రయాణిస్తున్న పచయప్పన్ కాలేజీ విద్యార్థులు ఆ ఘటనను చూశారు. పచయప్పన్ కాలేజీ విద్యార్థులపై ప్రతీకారంతో చెన్నై స్టేట్​ కాలేజీ విద్యార్థులు రాళ్లు రువ్వారు. అరకోణం రైలులో ఉన్న కాలేజీ విద్యార్థులు కూడా ప్రతిదాడికి దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు.. 15 మంది విద్యార్థులను అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.