టీడీపీ సానుభూతిపరులపై వైఎస్సార్​సీపీ రౌడీ మూకల దాడి - ఇళ్లల్లోకి చొరబడి సామగ్రి ధ్వంసం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 11:34 AM IST

thumbnail

YCP Leaders Attack TDP Sympathizers House: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడులో టీడీపీ కార్యకర్తల ఇంటిపై వైఎస్సార్​సీపీ వర్గీయులు దౌర్జన్య కాండకు దిగారు. పొలం కౌలు విషయంలో చెలరేగిన వివాదం ఇళ్లపై దాడి చేసే వరకు వెళ్లింది. 

చమళ్లమూడి, కాట్రపాడు, గారపాడు గ్రామాల నుంచి 40 మంది వైఎస్సార్​సీపీ కార్యకర్తల గారపాడు ఎస్సీ కాలనీలో టీడీపీ కార్యకర్తల ఇంట్లోకి వెళ్లి సామగ్రి ధ్వంసం చేశారు. రహదారిలో కనిపించిన టీడీపీ కార్యకర్తలను ఆపి వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ ఇన్​ఛార్జి రామాంజనేయులు ఛలో గారపాడు కార్యక్రమం నిర్వహించారు. అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శించారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతికామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో గత ఆరు నెలలుగా ఘర్షణలు జరగడంతో పోలీస్ పికెట్ నడుస్తోంది. అయినప్పటికీ రౌడీ మూకలు ఈ విధంగా దాడులు చేయడం ఏంటని రామాంజనేయులు ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.