తగ్గేదేలే - సెల్ఫీల కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 3:44 PM IST

Updated : Nov 27, 2023, 4:32 PM IST

thumbnail

Women Fighting for Selfies in Guntur: సెల్ఫీ.. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వీటి కోసం పోటీపడుతున్నారు. కొంతమంది అయితే.. కనీసం రోజుకు ఒక్క సెల్ఫీ అయినా తీసుకుంటారు. వాటిని సామాజిక  మాధ్యమాలలో షేర్ చేస్తుంటారు. తాజాగా సెల్ఫీ ఓ వివాదానికి కారణం అయింది. మహిళల మధ్య చిచ్చుపెట్టింది.  

సెల్ఫీల  కోసం మహిళలు తగ్గేదేలే అంటూ ఘోరంగా కొట్టుకున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. గుంటూరు నగర నడిబొడ్డున ఉన్న గాంధీ పార్కులో వందలాది ప్రజల మధ్య యువతులు పరస్పరం దారుణంగా దాడి చేసుకున్నారు. ఆధునీకరించిన గాంధీ పార్కును ఇటీవలే తిరిగి ప్రారంభించడంతో.. నగరవాసులు పెద్ద సంఖ్యలో పార్క్​కు తరలివచ్చారు. ఇక ఆదివారం కావడంతో చిన్నారులు, మహిళలు భారీగా పార్కుకు వచ్చారు. పార్కులో ఏర్పాటు చేసిన బటర్ ప్లై జోన్ వద్ద యువతుల మధ్య గొడవ జరగ్గా.. జుట్లు పట్టుకుని పరస్పరం దాడి చేసుకున్నారు. మరోవైపు పార్క్​ దగ్గర సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్లే గొడవ జరిగిందని పలువురు అంటున్నారు. 

ఇప్పుడు ఈ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఒక్కొక్కరూ వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియో చూసిన తరువాత మరి మీ కామెంట్ ఏంటి.  

Last Updated : Nov 27, 2023, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.