యూనివర్సిటీలో విద్యార్థుల వీరంగం.. లేడీ వార్డెన్​ వేధింపులు.. క్యాంపస్​లోని సామగ్రి ధ్వంసం

By

Published : Mar 19, 2023, 10:44 PM IST

thumbnail

ఉత్తరాఖండ్​లో ఉత్తరాంచల్​ యూనివర్సిటీ విద్యార్థులు వీరంగం సృష్టించారు. ఓ మహిళ వార్డెన్​ వేధింపులకు గురైందని విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయమై విశ్వవిద్యాలయం అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలిజేశారు. క్యాంపస్​ పరిసరాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అసలు ఏం జరిగిందంటే.. ఉత్తరాంచల్​ యూనివర్సిటీ చీఫ్​​ వార్డెన్​ తనను వేధింపులకు గురిచేశాడని దర్సల్​ అనే మహిళ వార్డెన్​ ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా యాజమాన్యం పట్టించుకోలేదు. చీఫ్​ వార్డెన్​పై చర్యలు తీసుకోలేదు. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు.. యూనివర్సిటీకి చెందిన యూఐటీ కాలేజీ వద్ద విధ్యంసం సృష్టించారు. బైక్​లను కర్రలతో పగులగొట్టారు. అందరూ ఒక చోట గుమిగూడి 'వి వాంట్​ జస్టిస్​' అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ, పోలీసులు క్యాంపస్​లోకి రాకుండా విద్యార్థులు గేట్​కు తాళం వేశారు. మహిళ వార్డెన్​ ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అయితే, దీనికి సంబంధించి యూనివర్సిటీ యాజమాన్యం ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని చెప్పారు. ఒకవేళ వారు ఫిర్యాదు చేస్తే.. దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.