విహార యాత్రలో విషాదం - వంజంగి కొండల్లో గుండెపోటుతో పర్యాటకుడు మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 12:27 PM IST

thumbnail

Tragedy in a Popular Tourist Destination in Alluri District : అల్లూరి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన వంజంగి కొండల్లో విషాదం నెలకొంది. వంజంగి కొండల్లో ఓ పర్యాటకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ప్రముఖ ఇంగ్లిష్​ పత్రికలో పనిచేస్తున్న వేణుగోపాల్​ మిత్రులతో కలిసి పాడేరులో పర్యటించారు. ఈ రోజు తెల్లవారుజామున వంజంగి కొండను ఎక్కుతుండగా వేణుగోపాల్​కు గుండెపోటు వచ్చింది.

Person Died of Heart Attack : వేణుగోపాల్​కు గుండెపోటు రావడంతో తన మిత్ర బృందం అప్రమత్తమై అంబులెన్స్​కు ఫోన్​ చేశారు. గుండెపోటు వచ్చిన వేణుగోపాల్​ను కొండపై నుంచి రహదారి మార్గానికి అత్యంత కష్టంగా చేర్చారు. అంబులెన్స్​ సిబ్బంది వేణుగోపాల్​ను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. అనంతరం వేణుగోపాల్​ మృతదేహన్ని పాడేరు ఆసుపత్రికి తరలించారు. విహారంలో విషాదం జరగడం వల్ల వేణుగోపాల్​ మిత్రులు బాధలో మునిగిపోయారు. విహారానికి వెళ్లిన వేణుగోపాల్​ మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.