RTC bus Overturned In Prakasam District : ప్రకాశం జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా.. 9మందికి గాయాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2023, 3:21 PM IST

thumbnail

RTC bus Overturned In Prakasam District : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం డిపోకు చెందిన ఇంద్ర బస్సు హైదరాబాద్ నుంచి మార్కాపురం బయల్దేరింది. ఈ క్రమంలో బోయలపల్లి వద్దకు రాగానే.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సు నుజ్జు నుజ్జు కాగా తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానికులు క్షతగాత్రులను.. 108 వాహనంలో యర్రగొండపాలెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు. మిగిలిన ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసి అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల వివరాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.