చీకటి జీవో 512ను రద్దు చేయాలి - న్యాయవాదుల నిరసన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 6:48 PM IST

thumbnail

Lawyers Protest Against 512 GO in AP: ఏపీ ప్రభుత్వం భూ యాజమాన్య హక్కులను కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చీకటి జీవో 512ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కర్నూలు, బాపట్ల, నంద్యాల జిల్లాలోని న్యాయవాదులు నిరసన బాట పట్టారు. ప్రజల హక్కులను హరించే విధంగా జీవో ఉందని, ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని అన్నారు. భూ యాజమాన్య హక్కులను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. భూ కబ్జాదారులకు అనుకూలంగా ఉన్న జీవోను రద్దు చేయాలన్నారు. 

ప్రజా వ్యతిరేక జీవోలు, చట్టాలను విడుదల చేసి ప్రభుత్వం ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం తెచ్చిన భూ యాజమాన్య చట్టం వల్ల రైతులు, అమాయక ప్రజలు సామాన్యులు నష్టపోతారని మండిపడ్డారు. న్యాయస్థానాలకు ఉన్న అధికారాలను రెవెన్యూ అధికారులకు బదలాయించడం వల్ల బాధితులకు సరైన న్యాయం జరగదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాల్లో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యాన పెద్ద సంఖ్యలో బైక్‌ ర్యాలి నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే జీవోను ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.