రైతు కష్టాన్ని తుపానుకు అప్పజెప్పిన జగన్ - తడిసిన ధన్యాన్ని మద్దతు ధరకు కొనాలి :​ దేవినేని

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 12:15 PM IST

thumbnail

EX- Minister Devineni Uma Comments On YSRCP Government : మద్దతు ధరకు ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ ఎన్టీఆర్‌ జిల్లా రెడ్డిగూడెంలో మాజీ మంత్రి దేవినేని ఉమా నిరసనకు దిగారు. ధాన్యం తడిసిన, రంగుమారిన, మెులకెత్తిన వాటిని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలంటూ రైతులు, తెలుగుదేశం శ్రేణులతో కలిసి  ధాన్యం రాశుల వద్ద ఆందోళన చేపట్టారు. అధికార పార్టీ నేతలు, దళారులు కలిసి రైతు కష్టాన్ని దోచుకుంటున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. 

Devineni Uma Protest In NTR District : రాష్ట్ర ప్రభుత్వం వాటర్​ మేనేజ్​మెంట్​ సరిగ్గా చేయకపోవడం వల్ల కాల్వలు, డ్రైన్లలో నీరు నిలువ ఉండి మరింత నష్టం జరిగిందని దేవినేని అన్నారు. వాటర్​ మేనేజ్​మెంట్​లో వైఫల్యం చెంది నోటిదాకా వచ్చిన పంటలను సీఎం జగన్మోహన్​రెడ్డి తుపానుకు అప్పజెప్పారని మండిపడ్డారు. ఎకరానికి సుమారు ఏడు వేల నుంచి పదివేల వరకు పంటకు నీరందించడానికి రైతులు వెచ్చించారు. జనరేటర్లు తెచ్చుకొని ఎన్నో కష్టాలను ఎదుర్కొని పండించిన పంట తుపానులో కొట్టుకుపోయిందని ఉమ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.