'ఉచిత ఇసుక పాలసీ చట్ట విరుద్ధం ఎలా అవుతుంది?' హైకోర్టులో వాదనలు - విచారణ వాయిదా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 4:55 PM IST

Updated : Nov 22, 2023, 5:36 PM IST

thumbnail

Chandrababu Bail Petition Hearing in High Court: ఇసుక కేసులో తెలుగుదేశం అదినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఆయన తరపున సిద్ధార్థ అగ్రవాల్ (Siddharth Agrawal) హై వాదనలు వినిపించారు. ప్రజల కోసమే ప్రభుత్వం 2016 లో ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చినట్టు కోర్టుకు తెలిపారు. ఈ విధానం ద్వారా ఎవరూ వ్యక్తిగత లబ్ధి పొందలేదని వాదన వినిపించారు. ఇళ్లు కట్టుకునే వారికి అవసరం ప్రాతిపదికన ఇసుక సరఫరా జరిగిందని కోర్టు దృష్టికి తెచ్చారు. బడా వ్యాపారులకు ఇతరులు సొమ్ము చేసుకోకుండా నియంత్రణ చేశామని స్పష్టం చేశారు. ఇసుక డంప్ లు చేయకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా నియమించినట్టు కోర్టుకు విన్నవించారు. 2019 లో ప్రభుత్వం మారాక 5 నెలల వరకూ ఇదే విధానాన్ని కొనసాగించారని గుర్తుచేశారు. ఇసుక విధానంలో లోపం ఉంటే 2023 అక్టోబర్ వరకూ కేసు ఎందుకు నమోదు చేయలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. 

బీజేపీ ఆరోపణలను దృష్టి మరల్చేందుకే: ఏపీ లో ఇసుక అక్రమాల పై బీజేపీ (BJP) చేసిన ఆరోపణలను దృష్టి మరల్చేందుకు ఈ కేసు పెట్టారన్నారు. ఇది మంత్రివర్గం లో తీసుకున్న నిర్ణయమని, అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చారని వివరించారు. ఈ కేసులో చంద్రబాబుకు   (Chandrababu) 17 ఏ వర్తిస్తుందని వాదనలు వినిపించారు. ఉచిత ఇసుక అనేది ఏవిధంగా నూ చట్ట విరుద్ధం కాదని చంద్రబాబు తరపు న్యాయవాది వెల్లడించారు. ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో పేదలకు, భవన నిర్మాణ పనులకు అందుబాటు లో ఉండేలా అప్పటి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని విధాన పరమైన నిర్ణయం తీసుకుందని కోర్టుకు తెలిపారు.  

చంద్రబాబు అధికార దుర్వినియోగం: ఇసుక కేసు (Sand case)లో  మధ్యాహ్నం సీఐడీ తరఫు న్యాయవాదులు హైకోర్టు (High Court)లో వాదనలు వినిపించారు. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేశారని సీఐడీ లాయర్లు ఆరోపించారు. కేబినెట్ నిర్ణయానికి విరుద్ధంగా విధాన నిర్ణయాలు తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.  విధాన నిర్ణయంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం జరిగినట్లు సీఐడీ లాయర్లు తెలిపారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం వెళ్లాలి.. లేదా సవరించి ముందుకు వెళ్లాలని, అలా కాకుండా వెళ్తే అవినీతి విస్తృతం అవుతుందని సీఐడీ లాయర్లు కోర్టులో వెల్లడించారు. కొందరికే లబ్ధి కలిగేలా మార్పులు చేసి లైసెన్స్ ఇచ్చారని సీఐడీ తరఫు లాయర్లు పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను ఎల్లుండి(ఈ నెల 24)కి వాయిదా వేసింది. 

Last Updated : Nov 22, 2023, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.