గిరిశిఖర ప్రజలకు తప్పని డోలీ మోతలు - గర్భిణిని 5కిలోమీటర్లు మోసుకెళ్లిన గ్రామస్థులు - Pregnant Woman Carried For Doli

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 17, 2024, 1:43 PM IST

thumbnail
గిరిశిఖర ప్రజలకు తప్పని డోలీ మోతలు - గర్భిణిని 5కిలోమీటర్లు మోసుకెళ్లిన గ్రామస్థులు (ETV Bharat)

Pregnant Woman Carried in Doli For Hospital: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గిరిశిఖర గ్రామస్థులకు డోలీ మోతలు తప్పలేదు. గ్రామానికి చెందిన వంతల కుషాయికి పురిటి నొప్పులు రావడంతో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి డోలీపై మోసుకుంటూ వెళ్తుండగా మార్గ మధ్యలోనే గర్భిణి మగబిడ్డకు జన్మనిచ్చింది. అక్కడి నుంచి తల్లిబిడ్డలను మోసుకుంటూ పుణ్యగిరి కొండ దిగువకు తీసుకొచ్చారు. అక్కడ ఉన్న ఆటోలో ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

గిరిపుత్రులకు ఎటువంటి మౌలిక సౌకర్యాలు నాటి నుంచి నేటి వరకు ఏ పాలక ప్రభుత్వాలు కల్పించలేదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా ప్రజాప్రతినిధుల్లో స్పందన కరవైందని గిరిపుత్రులు వాపోయారు. గిరిశిఖర గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చి ఉంటే ఈ డోలి దుస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు. ఇప్పటికైన నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను ఐటీడీ పరిధిలో చేర్చాలని గిరిజన సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.