పుట్టిన రోజు నాడే పునర్జన్మ.. 20 గంటలు మృత్యువుతో పోరాడి..

By

Published : Apr 30, 2023, 2:46 PM IST

thumbnail

Bhiwandi Building Collapse : పుట్టినరోజు నాడే పునర్జన్మ పొందాడు ఓ వ్యక్తి. మహారాష్ట్ర భివండీలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెండంతస్తుల భవనం కూలింది. భవన శిథిలాల్లో చిక్కుకున్న సునీల్​ పిసాల్​ అనే 38 ఏళ్ల వ్యక్తి.. 20 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఆదివారం శిథిలాల కింది నుంచి అతడి మాటలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన సహాయక సిబ్బంది​.. సునీల్​ను సురక్షితంగా బయటకు తీసి పట్టున రోజు నాడే పునర్జన్మ ప్రసాదించారు.

శనివారం జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు నలుగురు మృతిచెందారు. గాయపడిన 13 మందిని సహాయక బృందం ఆస్పత్రికి తరలించింది. కూలిన భవనం.. గ్రౌండ్​, మొదటి అంతస్తుల్లో ఓ గోదాము​ ఉంది. పైన అంతస్తులో నాలుగు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. సునీల్​ పిసల్​ కింద అంతస్తులో ఉన్న గోదాములో పనిచేస్తున్నాడు. అయితే, భవనం కూలిన సమయంలో సునీల్​తో పాటు మరో 15 మంది దాకా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. పోలీసులు, ఎన్​డీఆర్ఎఫ్​ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.