ఒంటిపై డీజిల్​ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు కారణం ఇదే

By

Published : Dec 2, 2022, 10:40 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

రాజస్థాన్​లో ఓ గొడవ కారణంగా మనస్తాపానికి గురైన యువకుడు ఒంటిపై డీజిల్​ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గాయాలపాలైన బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. భిల్వారా జిల్లాలోని ఫూలియకలన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో గీతా దేవి కుమారుడు చోటూ కుమావత్​తో కొందరు గొడవకు దిగారు. దీంతో మనస్తాపానికి గురైన చోటూ రోడ్డుపైకి వచ్చి డీజిల్​ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే తల్లి గీతాదేవి అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. అనంతరం శరీరంమంతా కాలిపోయి చోటు కింద పడ్డాడు. ఘటనా స్థలంలో గుమిగూడిన స్థానికులు చోటూను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.