జాతీయ జెండాకు గజరాజు సెల్యూట్

By

Published : Jan 26, 2023, 7:14 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

thumbnail

తమిళనాడులోని ఓ ప్రముఖ ఆలయ ప్రాంగణంలో జాతీయ జెండాకు సెల్యూట్​ చేసింది ఏనుగు. తిరునల్వేలి జిల్లాలోని ప్రసిద్ధ ఆలయమైన నెలైయప్పర్ గుడి ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఆలయ నిర్వాహకులు. ఈ సందర్భంగా గుడి ప్రధాన పూజారి జెండాను ఎగురవేశారు. గుడిలో దేవుడి సేవకు వినియోగించే గాంధీమతి అనే గజరాజు మువ్వెన్నల జెండాకు వందనం చేసింది. ఈ కార్యక్రమంలో ఏనుగు సెల్యూట్​ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మిఠాయిలు పంచారు. 

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.