ETV Bharat / state

నూతన భూహక్కుల చట్టం రద్దు చేయాలని న్యాయవాదుల ఆందోళన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2023, 4:14 PM IST

Updated : Dec 4, 2023, 7:06 PM IST

lawyers_protest_in_kadapa
lawyers_protest_in_kadapa

Lawyers Protest Rally to Cancel New Land Rights Act: ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలని వైఎస్సార్‌ జిల్లాలోని పలుచోట్లు న్యాయవాదులు నిరసన తెలిపారు. కబ్జాలకు పాల్పడే వారికి ఈ చట్టం చుట్టంగా మారుతుందని ఆరోపించారు. ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి ఈ చట్టాన్ని రద్దుచేసే వరకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

Lawyers Protest Rally to Cancel New Land Rights Act: భూ కబ్జాదారులకు వరంగా మారనున్న ఏపీ భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షులు రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని కబ్జాలకు పాల్పడే వారికి ఈ చట్టం చుట్టంగా మారుతుందని పేర్కొన్నారు. ఏపీ భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కడపలో న్యాయవాదులు ర్యాలీ (Lawyers rally in Kadapa) చేపట్టారు. ఈ ర్యాలీ జిల్లా కోర్టు నుంచి ప్రారంభమై కలెక్టరేట్ వరకు కొనసాగింది. అనంతరం కలెక్టర్​కు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ చట్టం అమల్లోకి వస్తే పేదలు భూములకు భద్రత ఉండదని పేర్కొన్నారు పేదల భూములు అక్రమ రికార్డులతో ఆక్రమించేవారు భూ కబ్జాదారులు పెరిగిపోతారని పేర్కొన్నారు. ఈ చట్టం వలన ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే సివిల్ కేసులు దాఖలు చేయడానికి వీలుండదని చెప్పారు. ప్రభుత్వం తక్షణం ఏపీ భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి ఈ చట్టాన్ని రద్దు చేసేంతవరకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

Lawyers Protest For High Court: 'అక్కడ.. ఇక్కడ.. రాజధాని ఎక్కడ..? రాయలసీమ ద్రోహి జగన్'

Lawyers protest in Proddatur: ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రొద్దుటూరులో న్యాయవాదులు నిరసనకు దిగారు. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రొద్దుటూరు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కోర్టు నుంచి శివాలయం కూడలి వరకూ ర్యాలీ చేశారు. చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులు కాపాడాలంటూ నినాదాలతో హోరెత్తించారు. సీఎం జగన్​కు వ్యతిరేఖంగా నినదించారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. భూ వివాదాలపై కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని అయితే కోర్టుకు వెళ్లకుండా వివాదాలను రెవెన్యూ ట్రిబ్యునళ్లలో తెల్చుకునెలా చట్టం తీసుకురావడం బాధాకరమన్నారు. ఆ చట్టం కొనసాగితే ప్రజలు రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని సామాన్యులకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.

Lawyers Protest for CBN in District Courts : చిత్తూరు, అనంతపురం జిల్లా కోర్టుల ఎదుట న్యాయవాదుల ఆందోళనలు

భూ హక్కుల చట్టం వల్ల ప్రజలకు సంబంధించినటువంటి స్థిరాస్తిలకు సంబంధిచిన హక్కులకు భంగం కలిగించే అవకాశం చాలా ఎక్కువ ఉంది. న్యాయ వ్యవస్థ నుంచి ఈ విషయం తీసేయడం చాలా అన్యాయం. ఎందుకంటే కోర్టులో ఉన్న భూముల ఉన్నప్పుడే ఇలాంటి భూ ఆక్రమణలు చాలా చూశాం ఈ అవకాశాన్ని రాజకీయ నాయకులు వినియోగించుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇలానే పెత్తందారుల చేతుల్లోకి ఈ చట్టం వెళ్తే వాళ్లు రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లు నమోదు చేసుకుంటే తర్వాత నిజమైన హక్కుదారునికి సివిల్ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు. కాబట్టి వెంటనే ఈ విషయం దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేస్తున్నాము.- రాఘవరెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కడప

Lawyers Agitation: రాష్ట్ర ప్రభుత్వం హామీలను నెరవేర్చాలని న్యాయవాదుల ఆందోళన

Last Updated :Dec 4, 2023, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.