ETV Bharat / state

బద్వేలులో కరోనాతో న్యాయవాది మృతి

author img

By

Published : May 26, 2021, 4:33 PM IST

died
న్యాయవాది గోపాల్ రెడ్డి మృతి

కడప జిల్లా బద్వేలుకు చెందిన న్యాయవాది గోపాల్ రెడ్డి కరోనాతో పోరాడుతూ తుది శ్వాస విడిశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

కడప జిల్లాలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా బద్వేలులోని ఆంజనేయనగర్​కు చెందిన న్యాయవాది గోపాల్ రెడ్డి కరోనాతో పోరాడుతూ తిరుపతిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు న్యాయవాదులు, తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటసుబ్బారెడ్డి, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి వేణుగోపాల్ శ్రద్ధాంజలి ఘటించి.. కుటుంబీకులకు సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి

భాజపా నేత బాల్​రెడ్డి మృతి... ఉపరాష్ట్రపతి సంతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.