ETV Bharat / state

పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం... నీట మునిగిన గణేష్​నగర్

author img

By

Published : Sep 10, 2020, 10:59 PM IST

heavy rains in vizianagaram and ganesh nagar is full of water
పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం... నీట మునిగిన గణేష్ నగర్

విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా వరహాలు గెడ్డలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో పురపాలక సంఘం పరిధిలోని గణేష్ నగర్ ముంపునకు గురైంది. కాలనీలోకి చేరిన వర్షపు నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

విజయనగరం జిల్లా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవటంతో... వరహాలు గెడ్డలో నీటి ప్రవాహం పెరిగింది. పురపాలక సంఘం పరిధిలోని గణేష్ నగర్ ముంపునకు గురైంది. గెడ్డ నీరు కాలనీలోకి వచ్చి చేరింది. ప్రధాన రహదారిలో ఎక్కువ నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కాలనీలోకి చేరిన వర్షపు నీరు బయటకు పోయేందుకు కాలువలు సరిగ్గా లేకపోవడంతో నివాసాల మధ్య నీరు నిల్వ ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ఏడు పదుల వయసులో పుట్టెడు కష్టాలు.. ఆదుకుంటున్న అమృత హస్తాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.