ETV Bharat / state

బాల సదనంలో 12మంది చిన్నారులకు అస్వస్థత

author img

By

Published : Mar 4, 2023, 9:26 AM IST

Etv Bharat
Etv Bharat

BALA SADAN CHILDRENS FOOD POISONING : విజయనగరంలోని పాల్‌నగర్ సమీపంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని బాలసదనంలో శుక్రవారం రాత్రి కలుషిత ఆహారం తిని 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర ఛైర్మన్ కేసలి అప్పారావు, ఐసీడీఎస్ పీడీ శాంతికుమారి వసతి గృహానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు.

BALA SADAN CHILDRENS FOOD POISONING : ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్​మెంట్​ సర్వీస్ (ఐసీడీఎస్) ఆధ్వర్యంలో విజయనగరంలోని పాల్ నగర్ సమీపంలో నడుస్తున్న బాల సదనంలో శుక్రవారం రాత్రి కలుషిత ఆహారం తిని 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ 12 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి కోడి గుడ్డు కూరతో పిల్లలకు అన్నం పెట్టారు. ఇది సహించక పోవడంతో వారు తినేందుకు అయిష్టత చూపారు. సిబ్బంది బలవంతం చేయడంతో ఆహారం తిన్న పిల్లలందరికీ కడుపు నొప్పితో పాటు, వాంతులు అయ్యాయి. విషయం తెలుసుకున్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కేసలి అప్పారావు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ (ఐసీడీఎస్) పీడీ శాంతి కుమారి వసతి గృహానికి చేరుకున్నారు. ఘటనపై ఆరా తీశారు. వారి విచారణలో తమ ఇబ్బందులను పిల్లలు ఏకరువు పెట్టారు.

తిడుతూ కొడుతున్నారు.. మరుగు దొడ్లను కడిగిస్తున్నారు : బాల సదనంలో సిబ్బంది తమను పట్టించుకోవడం లేదని, తిండి కూడా సక్రమంగా పెట్టడం లేదని చిన్నారులు వాపోయారు. ఇష్టానుసారం తిడుతూ కొడుతున్నారని, తమ తల్లిదండ్రులనూ దూషిస్తున్నారని రోదిస్తూ చెప్పారు. బాల సదనంలో పనులన్నీ తమతోనే చేయిస్తున్నారని, చివరకు మరుగు దొడ్లను కూడా కడిగిస్తున్నారని వాపోయారు. బాల సదనానికి ఏఎన్ ఎం, వైద్యురాలు చేరుకుని పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అనంతరం చైర్మన్ కేసలి అప్పారావు ఆదేశాల మేరకు వారిని మెరుగైన వైద్యం కోసం సర్వజన ఆసుపత్రికి తరలించారు.

పారిశుద్ధ్య లోపం.. సహించేది లేదని స్పష్టం : ప్రస్తుతం పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ (ఐసీడీఎస్) పీడీ శాంతి కుమారి తెలిపారు. ప్రస్తుతం బాల సదనం నడుస్తున్న భవనం అధ్వాన పరిస్థితుల నడుమ ఉందని, పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కనపడుతోందని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. జరిగిన ఘటనపై ఆయన మాట్లాడుతూ ఇక్కడ భవనాన్ని మార్చాలని సిబ్బందికి ఇప్పటికే పలు మార్లు సూచించానని చెప్పారు. బాల సదనంలో సిబ్బంది మధ్య సఖ్యత లేదన్న విషయాన్ని తాము గుర్తించామని అన్నారు. పిల్లలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.