'గౌస్​నగర్‌' ఘటనలపై ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆగ్రహం - సీఐ, ఐదుగురు ఎస్‌లకు ఛార్జ్‌ మెమోలు - Kadapa SP on Ghouse Nagar Incident

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 18, 2024, 7:42 PM IST

thumbnail
గౌస్ నగర్‌లో జరిగిన ఘటనలపై ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆగ్రహం - సీఐ, ఐదుగురు ఎస్‌లకు ఛార్జ్‌ మెమోలు (ETV Bharat)

SP Siddharth Kaushal Anger Over Kadapa Ghouse Nagar Incident: పోలింగ్​ రోజుల కడప గౌస్​నగర్​లో జరిగిన అల్లర్లకు సంబంధించి జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత రాత్రి గౌస్​నగర్​లో టీడీపీ, వైఎస్సార్​సీపీ వర్గాల మధ్య భారీ స్థాయిలో రాళ్లదాడి జరిగింది. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష సైతం వాహనం ఎక్కి తొడలు కొట్టి మీసం మేలేసి ప్రత్యర్థుల పైన కేకలు వేయడంతో పరిస్థితి ఉద్ధృతంగా మారింది. ఈ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులు నిర్లక్ష్యంగా వహించారని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సంబంధిత పోలీసు అధికారులకు చార్జిమెమో జారీ చేశారు. 

కడప వన్ టౌన్ సీఐ భాస్కర్ రెడ్డితోపాటు ఐదుగురు ఎస్ఐలకు ఛార్జ్​ మెమోలు జారీ చేశారు. కడప వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్, రిమ్స్ పోలీస్ స్టేషన్​లో ఎస్సైలుగా పనిచేస్తున్న ఐదుగురిపైన చార్జ్​ మెమో జారీ చేసిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వారందరి పైన శాఖ పరమైన విచారణకు ఆదేశించారు. శాఖా పరమైన విచారణ తర్వాత తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.