ETV Bharat / state

AP Weather: అల్పపీడనం ఏర్పడే అవకాశం... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..?

author img

By

Published : Nov 7, 2022, 2:19 PM IST

AP Weather: ఈ నెల 9 నాటికి నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు దగ్గరగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో తమిళనాడు- పుదుచ్చేరి తీరాలకు దగ్గరగా బలపడి... వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. వచ్చే రెండు రోజులు మాత్రం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది.

low pressure
అల్పపీడనం ఏర్పడే అవకాశం

AP Weather: ఈనెల 9వ తేదీ నాటికి నైరుతీ బంగాళాఖాతంలో శ్రీలంకకు దగ్గరగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతరం 48 గంటల్లో తమిళనాడు - పాండిచ్చేరి తీరాలకు దగ్గరగా ఇది బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కామోరిన్ ప్రాంతం నుంచి కోస్తా ప్రాంతాల వరకూ 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాగల రెండు రోజుల వరకూ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా పొడి వాతావరణం నెలకొని ఉన్నట్టు పేర్కొంది.

కోస్తా జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నవంబరు 11 నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ మహారాష్ట్రలలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ స్పష్టం చేసింది. దక్షిణ భారత్​లోని అన్ని రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. నవంబరు 10,11 తేదీల నుంచి తమిళనాడు, కోస్తాంధ్ర తీరాల వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.