AP Weather: ఈనెల 9వ తేదీ నాటికి నైరుతీ బంగాళాఖాతంలో శ్రీలంకకు దగ్గరగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతరం 48 గంటల్లో తమిళనాడు - పాండిచ్చేరి తీరాలకు దగ్గరగా ఇది బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కామోరిన్ ప్రాంతం నుంచి కోస్తా ప్రాంతాల వరకూ 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాగల రెండు రోజుల వరకూ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా పొడి వాతావరణం నెలకొని ఉన్నట్టు పేర్కొంది.
కోస్తా జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నవంబరు 11 నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ మహారాష్ట్రలలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ స్పష్టం చేసింది. దక్షిణ భారత్లోని అన్ని రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. నవంబరు 10,11 తేదీల నుంచి తమిళనాడు, కోస్తాంధ్ర తీరాల వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
ఇవీ చదవండి: