ETV Bharat / state

రిషికొండ తవ్వకాలపై హైకోర్టుకు కేంద్ర కమిటీ నివేదిక.. విచారణ 26కి వాయిదా

author img

By

Published : Apr 12, 2023, 1:02 PM IST

Rishikonda
Rishikonda

Rishikonda Illegal Mining latest updates: విశాఖపట్నంలోని రిషికొండ తవ్వకాలకు సంబంధించిన నివేదికను నేడు కేంద్ర కమిటీ హైకోర్టులో సమర్పించింది. కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. నివేదికపై కౌంటర్ దాఖలు చేయాలంటూ పిటిషనర్లను ఆదేశిస్తూ..తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.

Rishikonda Illegal Mining latest updates: విశాఖపట్నం జిల్లాలో ఉన్న రుషికొండకు సంబంధించి.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారని కొన్ని నెలల క్రితం విశాఖపట్నం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన పార్టీ నేత మూర్తి యాదవ్‌ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్లపై పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం.. రిషికొండ తవ్వకాల విషయంలో క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీని నియమించింది. వీలైనంత త్వరగా రుషికొండ తవ్వకాలకు సంబంధించిన వివరాలను హైకోర్టుకు సమర్పించాలని కమిటీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

రిషికొండ తవ్వకాలపై నివేదక సమర్పణ: ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర కమిటీ.. క్షేత్రస్థాయిలో విచారణను మొదలుపెట్టింది. రిషికొండపై జరుగుతున్న తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కమిటీ ఇవాళ హైకోర్టులో తన నివేదికను సమర్పించింది. దీంతో నివేదికను పరిశీలించిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

రిషికొండ తవ్వకాలపై హైకోర్టులో పిటిషన్లు: గతంలో రిషికొండపై నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని.. జనసేన కార్పొరేషన్ మూర్తియాదవ్, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రిషికొండపై జరుగుతున్న తవ్వకాలు, భవన నిర్మాణాలు ఎంతమేర జరుగుతున్నాయో.. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఇటీవలే ఐదుగురు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన కేంద్ర బృందం నేడు నివేదికను హైకోర్టుకు సమర్పించింది.

అసలు ఏం జరిగిదంటే: విశాఖపట్నంలోని రిషికొండ తవ్వకాలకు సంబంధించి.. అక్టోబర్ 13వ తేదీ 2022వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి చెెందిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో పాటు జనసేన పార్టీ నేత మూర్తి యాదవ్‌‌లు కలిసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ల్లో రుషికొండపై గతంలో 9.2 ఎకరాల్లో మాత్రమే తవ్వకాలు జరిపాలని అనుమతులు ఉండగా..రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 20 ఎకరాలు తవ్వేసిందని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, ఆ తవ్వకాలకు సంబంధించిన తాజా సాక్ష్యాలైన గూగుల్ మ్యాప్‌లను కూడా న్యాయస్థానంలో సమర్పించారు. ఈ క్రమంలో పిటిషనర్లు సమర్చించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన ధర్మాసనం..రిషికొండ తవ్వకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని, ఓ నివేదికను సమర్చించేలా కేంద్ర ప్రభుత్వ అటవీశాఖను ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో రిషికొండ తవ్వకాలపై పలుమార్లు విచారించిన ధర్మాసనం వాయిదాలు వేస్తూ వచ్చింది. తాజాగా రిషికొండపై జరుగుతున్న తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కమిటీ హైకోర్టులో తన నివేదికను సమర్పించడంతో.. కౌంటర్ దాఖలు చేయాలంటూ పిటిషనర్లను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.