ETV Bharat / state

ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం ఎర్రన్నాయుడు పార్కు - నాడు కళకళ, నేడు వెలవెల

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 12:32 PM IST

Updated : Dec 21, 2023, 7:34 PM IST

Etv Bharatyerranaidu_park_tekkali_srikakulam_disrtict
Etv Bhayerranaidu_park_tekkali_srikakulam_disrtict

Yerranaidu Park Tekkali Srikakulam Disrtict : ఒకప్పుడు ఆహ్లాదానికి ఆనవాళ్లుగా ఉండే ఉద్యానవనాలు నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ప్రభుత్వం ఉద్యానవనాల నిర్వహణ గాలికి వదిలేయడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలో ఎర్రం నాయుడు పార్క్ దుస్థితి చూస్తే పార్కుల నిర్వహణపై అధికారులు చూపిస్తున్న శ్రద్దేంటో కనబడుతోంది.

Yerranaidu Park Tekkali Srikakulam Disrtict : చిన్నారులు ఆడుకోవడానికి, పట్టణవాసులు ఆహ్లాదం పొందడానికి, వ్యాయామం కోసం వెళ్లే స్థలం పార్కు(Park). కానీ, అలాంటి పార్కులు ప్రస్తుతం శిథిలావస్థకు చేరి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఒకప్పుడు ఆహ్లాదానికి ఆనవాళ్లుగా ఉండే ఉద్యానవనాల, పార్కుల నిర్వహణను అధికారులు గాలికి వదిలేయడంతో ముళ్లపొదలు పెరిగి అవి అడవిని తలపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉండే ఎర్రన్నాయుడు పార్క్ (Yerranaidu Park) దుస్థితి ఇది. నాలుగేళ్ల ముందు పచ్చని చెట్లతో కలకల్లాడే ఈ పార్కు ఆధ్వానంగా మారి నిరుపయోగంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.

ప్రభుత్వం మారింది.. నెల్లూరు సిటీ పార్క్​ మూతపడింది

Yerranaidu Childrens Park Poor Condition : శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో ఉన్న ఎర్రన్నాయుడు పార్కును 2018లో గత ప్రభుత్వం 50లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. టెక్కలితో పాటు చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలకు ఆహ్లాదకరంగా, పిల్లల ఆటల కోసం, పట్టణవాసులు వ్యాయామం కోసం, అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాట్లు చేశారు. అయితే గత నాలుగు ఏళ్లుగా ఆ పార్కు నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. కనీసం సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో పార్కు లోపల పెద్ద పెద్ద ముళ్లపొదలు పెరిగి అడవిని తలపిస్తోంది. ఫుట్‌పాత్‌లు, కుర్చీలు, విగ్రహాలు, పిల్లల ఆట పరికరాలు శిథిలావస్థకు చేరాయి. తిరిగి ఉపయోగించలేని పరిస్థితికి చేరడంతో పార్కులో ఉండే ఇనుప సామగ్రి, కంచె, పిల్లల ఆడుకునే పరికరాలు దొంగల పాలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. పగలూ, రాత్రి అనే తేడా లేకుండా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీంతో ఎక్కడా చూసిన మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. ఎప్పుడూ జనాలు, చిన్నారులతో కళకళలాడుతూ ఉండే పార్కు నిరుపయోగకరంగా మారిందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పర్యవేక్షణ కరవు... మురుగు కుంటగా పార్కు

No Development in Yerranaidu Park : లక్షల రూపాయల ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన పార్కుల నిర్వహణపై అధికారులు చూపిస్తున్న శ్రద్ద ఏంటో ఈ పార్కును చూస్తే మనకు తెలుస్తోంది. ఈ పార్కులో వృద్ధులు, ఉద్యోగులు ఉదయం, సాయంత్రం నడక, వ్యాయామం చేసుకునేందుకు గతంలో ఎంతో సౌకర్యంగా ఉండేదని ప్రస్తుతం ఆనువుగా లేకపోవడంతో రోడ్లపై నడవాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. దీంతో రోడ్లపై ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా ఉందని, ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకొని ఆ పార్కుకు పూర్వవైభవంగా తీసుకురావాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

అభివృద్ధికి నోచుకోని దొనకొండ... మూడేళ్లైనా మొదలుకాని పార్క్ పనులు

Last Updated :Dec 21, 2023, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.