పర్యవేక్షణ కరవు... మురుగు కుంటగా పార్కు

author img

By

Published : Jun 23, 2022, 6:02 AM IST

Kadapa Rajiv Park

Park changed as Sewage lame: అది కడప నగర ఉద్యానవనం.. చుట్టూ పదుల సంఖ్యలో కాలనీలు.. ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లలు, పెద్దలతో సందడిగా ఉండే ఆహ్లాదకర ప్రాంతం.. అయితే ఇదంతా.. అందమైన గతం.. కానీ.. ఇప్పుడు అదే పార్కు.. ఓ మురుగు కుంటగా మారిపోయింది.. పట్టించుకునేవారు లేక మూతబడిపోయింది. అధికారుల నిర్లక్ష్యంతో కడప నగరవాసులకు ఆహ్లాదం కరవైంది.

పర్యవేక్షణ కరవు... మురుగు కుంటగా పార్కు

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. కడపలో రాజీవ్‌ పార్క్​ను ప్రారంభించారు. వేల రూపాయలు వెచ్చించి పార్కును అందంగా తీర్చిదిద్దారు. పిల్లల కోసం ఆట సదుపాయాలు.. పెద్దల కోసం వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశారు.. ఈ పార్కు చుట్టూ వేల సంఖ్యలో నివాసాలు ఉన్నాయి. ఉదయం, సాయంత్రం నడకకు వచ్చే వారితో... వారి పిల్లలతో ఈ పార్కు ఒకప్పుడు ఎంతో సందడిగా కనిపించేది. రాను రాను పర్యవేక్షణ లోపించి మురుగు కుంటగా మారింది.

పార్కు చుట్టూ ఉన్న రోడ్డు క్రమంగా ఎత్తుగా కావడంతో పార్కు పల్లమైంది. వర్షపు నీరంతా పార్కులోకి చేరుతోంది. మురుగు వ్యవస్థ సరిగా లేక నీరు నిల్వ ఉండి.. పాచి పట్టింది. అధికారులు పట్టించుకోవడం మానేశారు. క్రమంగా జనం కూడా రావడం మానేశారు. ఇప్పుడు పార్కును పూర్తిగా మూసేశారు.

కడప నగరం మొత్తానికి నెహ్రు పార్కు, రాజీవ్ పార్కు రెండే ఉన్నాయి. రాజీవ్ పార్కును మూసేయడంతో నగరవాసులుకు ఆహ్లాదం కరవైంది. విలువైన భూమిని కబ్జా చేసేందుకే ఇలా పార్కును నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. కడప నగరం నడిబొడ్డున ఉన్న రాజీవ్‌ పార్కుకు పునర్‌ వైభవం తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : అమ్మఒడి పథకంలో... ఈ ఏడాది లక్షమందికి కోత!

నాగ చైతన్య-సమంత-శోభితా ధూళిపాల.. అసలేం జరుగుతోంది?

సోదరిని కత్తితో ఏడుసార్లు పొడిచిన సోదరుడు.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.