ETV Bharat / state

'మహేంద్రతనయపై అడ్డుకట్టలు - శ్రీకాకుళంలో తాగునీటి కష్టాలు'

author img

By

Published : Feb 14, 2023, 1:46 PM IST

Updated : Feb 14, 2023, 2:22 PM IST

Odisha authorities
Odisha authorities

Drinking water problem started in Srikakulam: ఒడిశా నుంచి దిగువన ఉన్న ఆంధ్ర ప్రాంతంలోకి ప్రవహిస్తున్న మహేంద్రతనయ నదిపై ఒడిశా అధికారులు తాత్కాలిక అడ్డుకట్టలు వేశారు. ఇసుక బస్తాలతో నదికి అడ్డుకట్ట వేసి జలాలను మళ్లించటం వల్ల శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నీటి కష్టాలు మొదలై.. రానున్న వేసవి కాలంలో తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు.

'మహేంద్రతనయపై అడ్డుకట్టలు - శ్రీకాకుళంలో తాగునీటి కష్టాలు'

Drinking water problem started in Srikakulam: ఒడిశా నుంచి దిగువన ఉన్న ఆంధ్ర ప్రాంతంలోకి ప్రవహిస్తున్న మహేంద్రతనయ నదిపై ఒడిశా అధికారులు తాత్కాలిక అడ్డుకట్టలు ఏర్పాటు చేయడంపై.. సరిహద్దు ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా ప్రజల అవసరాల కోసం శ్రీకాకుళం జిల్లాలోని ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పర్లాఖిముడి వద్ద ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసి మహేంద్రతనయ నదీ జలాలను మళ్లిస్తున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. తాగు, సాగునీటికి ఆధారమైన మహేంద్రతనయలో అడ్డుకట్టలను తొలగించకుంటే రానున్న వేసవి కాలంలో తీవ్ర ఇబ్బందులు తప్పవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఒడిశా భూభాగంలో పుట్టిన మహేంద్రతనయ నది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వద్ద ఆంధ్రాలో ప్రవేశిస్తుంది. ఈ నది అటు ఒడిశాతో పాటు ఇటు పాతపట్నం నియోజకవర్గానికి ప్రధానమైన నీటి వనరుగా ఉంది. ఈ నదిపై ఆధారపడి 7 రక్షిత నీటి పథకాలు, 2 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. సుమారు 25 వేల మంది జనాభాకు ఈ నది తాగునీటి అవసరాలను తీరుస్తోంది. రబీ కాలంలో వందలాది ఎకరాల సాగుకు ఈ నదీ జలాలపైనే రైతులు ఆధారపడుతున్నారు. అయితే ప్రతి ఏడాది వేసవిలో నదిలో నీటి నిల్వలు తగ్గటం సర్వసాధారణం. కాని ఒడిశా అధికారులు మాత్రం వేసవి రాకముందే తమ ప్రాంత ప్రజల నీటి అవసరాల దృష్ట్యా నది ప్రవాహానికి అడ్డుగా ఇసుక కట్టలు వేసి నీటిని మళ్లిస్తున్నారు.

అక్రమ అడ్డుకట్టలు వేసి ఒడిశా అధికారులు నీటిని మళ్లించటంతో పాతపట్నం పరిసర ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడుతుంది. అనేక ప్రాంతాల్లో దప్పిగ కేకలు తప్పటంలేదు. నీటి నిల్వల అనిశ్చితి కారణంగా చాలామంది రైతులు పంట సాగును నిలిపివేస్తున్నారు. ఒడిశాలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా మహేంద్రతనయ నదిలో నీటి ఊటలు మాత్రమే ప్రవహిస్తున్నాయి. వాటిని కూడా అధికారులు అడ్డుకట్టలతో నిలిపివేస్తే.. దిగువప్రాంతాల వారు వేసవిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా టాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి వస్తుందని వాపోతున్నారు. నదిలోని అడ్డుకట్టలను తొలగించి దిగువ ప్రాంతాలకు నీరు ప్రవహించేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలని పాతపట్నం నియోజకవర్గ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి

Last Updated :Feb 14, 2023, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.