భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదికకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి 47 చేరింది. ఇక్కడ వివిధ పరీక్షలు చేసి ఈ నెల 27న ఉదయం 9 గంటల 28 నిమిషాలకు దీనిని నింగిలోకి పంపనున్నారు. ఈ వాహన నౌక హై రిజల్యూషన్ చిత్రాలు తీసే సామర్థ్యం గల మూడో తరానికి చెందిన అధునాతన కార్టోశాట్-3 ఉపగ్రహంతో పాటు, అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా యూఎస్కు చెందిన 13 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. రాకెట్ సన్నద్ధత, లాంచ్ ఆథరైజేషన్ సమావేశాలు సోమవారం జరగనున్నాయి.
ఇవీ చూడండి: