ETV Bharat / state

సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్​లో కరోనా కలకలం... 12మంది ఉద్యోగులకు కొవిడ్ పాజిటివ్‌

author img

By

Published : Jan 9, 2022, 12:23 PM IST

Corona kalakalam in SHAR
Corona kalakalam in SHAR

Corona kalakalam in SHAR: నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో కరోనా కలకలం రేపింది. సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్​లో పని చేస్తున్న 12మంది ఉద్యోగులకు కొవిడ్ పాజిటివ్​గా​ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారందరూ హోం ఐసోలేషన్​లో ఉన్నారు.

Corona kalakalam in SHAR: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో కరోనా కలకలం సృష్టించింది. సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్​లో పని చేస్తున్న 12మంది ఉద్యోగులకు కొవిడ్​ వైరస్ సోకింది. షార్ కేంద్రం నుంచి బయటకు వెళ్లి వచ్చే వారికి చేసిన పరీక్షల్లో 12మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారందరూ హోం ఐసోలేషన్​లో ఉన్నారు.

కొవిడ్ సోకినవారి నుంచి ఒమిక్రాన్ పరీక్షలు చేసేందుకు శాంపిల్స్ తీసుకున్నారు. సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్​ నుంచి రాకెట్ ప్రయోగాలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో కరోనా సోకడం గందరగోళానికి గురి చేస్తోంది.

ఇదీ చదవండి: దేశంలో కరోనా ఉపద్రవం- ఒక్కరోజే 1.59 లక్షల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.