ETV Bharat / state

సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్​లో ఉద్రిక్తత... కుర్చీలు విసురుకున్న నేతలు

author img

By

Published : Nov 10, 2022, 4:59 PM IST

Clash between two TDP factions
సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్​లో ఉద్రిక్తత

Clash between two TDP factions: సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా రెండు వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. పార్టీ కార్యాలయం ఎన్టీఆర్​ భవన్‌లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి విషయంలో ఏదోఒకటి తేల్చాలని ఇరు వర్గాలు డిమాండ్‌ చేశాయి. నినాదాలతో రెండు వర్గాల కార్యకర్తలు పరస్పరం గొడవకు దిగారు.

Clash between two TDP factions: పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్​లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సత్తెనపల్లి పార్టీ సంస్థాగత కమిటీల నియామకం కోసం తెదేపా నేతలు నక్కా ఆనంద బాబు, జీవీ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర, డోలా బాలావీరాంజనేయ స్వామి,.. నియోజకవర్గ పరిశీలకులు గన్నే వెంకట నారాయణ ప్రసాద్​లు పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని.. ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. దీంతో పార్టీ సంస్థాగత నియామకాలు రసాభాసగా మారాయి. వేరే నియోజకవర్గ తెదేపా నాయకులు నియామక కార్యక్రమానికి వచ్చారని.. కోడెల వర్గం ఆరోపించింది. స్థానిక నియోజకవర్గం నేతల పెత్తనమే ఇక్కడ కొనసాగాలని జీవీ ఆంజనేయులు వద్ద కోడెల శివరాం డిమాండ్ చేశారు. ఘటనతో కమిటీ సమావేశం నుంచి మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు వెళ్లిపోయారు.

సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్​లో ఉద్రిక్తత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.