వైసీపీ కుట్ర బట్టబయలు... యువగళం యాత్రను అడ్డుకోవాలని వాట్సాప్​లో మెసేజ్‌లు

author img

By

Published : Jan 21, 2023, 12:25 PM IST

Yuvagalam Padayatra

Yuvagalam Padayatra: కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రను వైసీపీ అడ్డుకోవాలని చూస్తోందంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ మేరకు వైసీపీ వాట్సాప్ గ్రూప్ మెసేజ్​లను తెదేపా బయటపెట్టింది. ఈ రెచ్చగొట్టే మెసేజ్ లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

వైసీపీ కుట్ర బట్టబయలు... యువగళం యాత్రను అడ్డుకోవాలని వాట్సాప్​లో మెసేజ్‌లు

Yuvagalam Padayatra: చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రను వైసీపీ అడ్డుకోవాలని చూస్తోందంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ మేరకు వైసీపీ వాట్సాప్ గ్రూప్ మెసేజ్​లను టీడీపీ బయటపెట్టింది. పాదయాత్ర అడ్డుకోవడం, దాడులకు సిద్ధం కావాలి అంటూ కార్యకర్తలకు వైసీపీ మెసేజ్‌లు పంపింది. లోకేష్​ పాదయాత్రను అడ్డుకుంటామని వైసీపీ నేత, మండల మాజీ అధ్యక్షుడు, ఎంపీపీ భర్త కోదండరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశాడు. ఈ ప్రకటన సామాజిక మాద్యమాల్లో హల్​చల్​ చేస్తోంది. మరోవైపు ఇటీవల కుప్పంలో పర్యటించిన ఎంపీ మిధున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రలు ఎవరైనా చేసుకోవచ్చు అని, లోకేష్ పాదయాత్రకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.