రిమాండ్‌లో ఉన్న వ్యక్తిని పోలీసులు కొట్టారంటూ బంధువుల ఆందోళన.. జడ్జికి ఫిర్యాదు

author img

By

Published : Jan 21, 2023, 10:50 AM IST

Argument with police at subjail

Argument with police at subjail: నాటు సారా కేసులో ఆరెస్టై రిమాండ్‌లో ఉన్న వ్యక్తిని పోలీసులు కొట్టారంటూ కర్నూలు జిల్లా పత్తికొండలో బంధువులు ఆందోళనకు దిగారు. సబ్‌జైల్‌ వద్దకు చేరి పోలీసులతో వాగ్వాదానికి దిగి.. ఆ తర్వాత జడ్జి ఇంటికి వెళ్లి ఫిర్యాదు చేశారు.

Argument with police at subjail: పోలీసులు చితకబాదారని సబ్ జైలు ఎదుట బాధితుడి బంధువులు ఆందోళనకు దిగిన ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో చోటు చేసుకుంది. నాటు సారా కేసులో ఆరెస్టై రిమాండ్‌లో ఉన్న పాండురంగడు అనే వ్యక్తిని పోలీసులు స్టేషన్​కు తీసుకురాగా సీఐ చితకబాదాడంటూ నిందితుడి తరపు బంధువులు సబ్ జైలు వద్ద ఆందోళనకు దిగారు. జడ్జి ఇంటి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సీఐని పిలిపించి జడ్జి వివరణ కోరినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. జైలు వద్ద పోలీసులకు నిందితుడి బంధువులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.