GADAPA GADAPA IN KURNOOL: కర్నూలు జిల్లా ఆదోనిలోని అంబేడ్కర్నగర్లో సోమవారం ‘గడప గడపకూ...’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, పురపాలక అధికారులు పర్యటించారు. మాల అంజినయ్య అనే వృద్ధుడు పలు పథకాల కింద రూ.9.32 లక్షల లబ్ధి పొందినట్లు ఎమ్మెల్యే పుస్తకం అందించారు. ఆ తర్వాత అందులోని వివరాలు తెలుసుకున్న అంజినయ్య అవాక్కయ్యారు. ఆయన పూరిగుడిసెలో ఉంటూ వృద్ధాప్య పింఛనుతో జీవనం గడుపుతున్నారు. ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చినట్లు గతంలో పత్రం ఇచ్చారు. కానీ ఆ స్థలాన్ని చూపలేదు. అయితే ఇంటి స్థలానికి రూ.6 లక్షలు, నిర్మాణానికి రూ.2.50 లక్షల చొప్పున లబ్ధి పొందినట్లు పుస్తకంలో నమోదు చేశారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలే వెచ్చిస్తోంది. రూ.2.50 లక్షలు చెల్లించినట్లు చూపారు. కాలనీలో చాలామంది ఇంటి లబ్ధిదారులకు ఇలాంటి పుస్తకాలే అందించారు.
ఇవీ చదవండి: