కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 32వ రోజుకు చేరాయి. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో హై కోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు గుర్తు చేశారు. వారి దీక్షకు భవసార క్షత్రియులు మద్దతు తెలిపారు. నగరంలోని శ్రీకృష్ణ దేవరాయల కుడలి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.. గాంధీ విగ్రహానికి పూల మాల వేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు.
ఇదీ చూడండి