కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవిలత, డిప్యూటీ కలెక్టర్ ధ్యాన్చంద్ జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడు, రామచంద్రనిపేట గ్రామాల్లో 'స్వామిత్వ యోజన' సర్వే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. డ్రోన్ కెమెరాల సాయంతో గ్రామంలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను నమోదు చేసే కార్యక్రమాలు ఈ సర్వే ద్వారా జరగనుంది. ప్రతి గ్రామంలోని వ్యవసాయ భూములు, ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, చెరువులు తదితర అంశాల కచ్చితమైన కొలతలను ఈ కార్యక్రమం ద్వారా నమోదు చేస్తారు. ఈ నమూనా గ్రామాల్లో వచ్చిన ఫలితాలను బట్టి దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే కార్యాచరణతో అధికారులు ముందుకు సాగుతారు.
ఇదీ చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ప్రారంభం.. 23 వరకు పరీక్షలు