ETV Bharat / state

వంతెన పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి!

author img

By

Published : Sep 29, 2019, 4:39 PM IST

వంతెన పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోయాడు.

వంతెన పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి...అసలు కారణం ఇదే!

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు జాతీయ రహదారి పక్కన ఓ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. రాష్ట్ర సరిహద్దుల్లోని పాలిటి వంతెన కింద నీటి మధ్యలో ఉన్న ఈ మృతదేహాన్ని వెంకన్న (40) అనే వ్యక్తిదిగా స్థానికులు గుర్తించారు. వారు తెలిపిన సమాచారం ప్రకారం... శనివారం రాత్రి బైక్ పై కోదాడ వైపు వెళ్తున్న వెంకన్నను చెక్ పోస్ట్ వద్ద తెలంగాణా పోలీసులు అడ్డుకున్నారు. బండి అక్కడే వదిలి వెనక్కి పరిగెత్తిన వెంకన్నను పోలీసులు వెంబడించారు. కొద్ది దూరం తర్వాత అతను కనిపించలేదు. పోలీసులు బండి తెచ్చి తక్కెళ్లపాడులో అప్పగించారు. ఈ రోజు ఉదయం వెంకన్న మృతదేహంగా తేలాడు. అతను వంతెనపై నుంచి పడి చనిపోయినట్టు భావిస్తున్నారు. ఘటనపై చిల్లకల్లు పోలీసుసు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చూడండి

కాపాలాదారుడే దొంగ... 76టన్నుల ఇనుము చోరీ

Intro:

ఘనంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు .పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రంలో వేంచేసియున్న ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవమైన శ్రీ మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రుల లో భాగంగా మొదటిరోజు శ్రీ బాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు .అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు .అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో గణపతి పూజలు నిర్వహించారు.తెల్లవారుజాము నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారుBody:అరుణ్Conclusion:8008574467
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.