ETV Bharat / state

తెలంగాణలోని గాంధీలో ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

author img

By

Published : May 11, 2020, 7:48 PM IST

plasma therapy clinical trails started in gandhi hospital
తెలంగాణ గాంధీ ఆసుపత్రిలోప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి ప్లాస్మా వైద్యం అందించే ప్లాస్మా థెరపీ క్లినికల్​ ట్రయల్స్ తెలంగాణలోని​ గాంధీ ఆస్పత్రిలో ప్రారంభమైంది. ఐసీఎంఆర్‌ పర్యవేక్షణలో ఈ ప్లాస్మా చికిత్స ప్రారంభించారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ద్వారా ప్లాస్మా సేకరించారు. ఇప్పటికే వైరస్‌ సోకి వ్యాధి నుంచి బయటపడి ఇళ్లకు వెళ్లిన 15 మంది తమ రక్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి ప్లాస్మా వైద్యం అందించే ప్లాస్మా థెరపీ క్లినికల్​ ట్రయల్స్ తెలంగాణలోని​ ​ గాంధీ ఆస్పత్రిలో ప్రారంభమైంది. ఐసీఎంఆర్‌ పర్యవేక్షణలో ఈ ప్లాస్మా చికిత్స ప్రారంభించారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ద్వారా ప్లాస్మా సేకరించారు. ప్రస్తుతం కరోనాతో గాంధీలో చికిత్స పొందుతున్న వారిలో 30 మంది ఐసీయూలో ఉన్నారు. వీరిలో కొందరికి ప్లాస్మా వైద్యం అందించాలని తెలంగాణ ​రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవలే గాంధీకి ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చింది. ప్లాస్మా వైద్యం ఎవరికి పడితే వారికి చేయడానికి వీలులేదు. ప్రమాదకర పరిస్థితిలో ఉన్నవారికి ఈ వైద్యం అందించలేమని.. అలా అని కోలుకునే అవకాశం ఉన్న వారికి కూడా చేయలేమని గాంధీ వైద్యులు తెలిపారు. ఆరోగ్యం మధ్యస్థంగా ఉండి ఇబ్బంది పడుతూ కోలుకునేందుకు అవకాశం ఉండే రోగులకు మాత్రమే ప్లాస్మా వైద్యం అందిస్తారు.

ఐసీయూలో ఉన్న వారిలో..

గాంధీలో ఐసీయూలో ఉన్న వారిలో ఎంతమందికి ఈ చికిత్స అవసరముందన్న విషయాన్ని ఏ రోజుకారోజు వైద్యులు అంచనా వేస్తున్నారు. చికిత్స అందించాలనుకునే రోజు సంబంధిత రోగి ఆరోగ్య స్థితి ఆధారంగా ప్లాస్మా ఎక్కిస్తారని చెబుతున్నారు. కోలుకున్న వారి నుంచి రక్తం తీసుకునేందుకు కచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంది.

28 రోజుల తర్వాతే..

ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన 28 రోజుల తర్వాతే వారి నుంచి రక్తం సేకరించాలి. ప్లాస్మా కోసం రక్తం ఇచ్చే వారి వయసు 18 ఏళ్ల పైబడి ఉండాలి. 55 కేజీల కంటే ఎక్కువ బరువు ఉండాలి. సంబంధిత వ్యక్తుల అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తుండాలి. బీపీ, షుగర్‌ నియంత్రణలో ఉండాలి. పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉంటేనే 400 ఎంఎల్‌ రక్తం సేకరిస్తారు. ఇలా సేకరించిన రక్తం నుంచి ప్రత్యేక పరికరాల ద్వారా ప్లాస్మాను విడగొట్టి భద్రపరుస్తారు. ఈ రక్తం ఆరు నెలల వరకు భద్రంగా ఉంటుందని ఉంటుంది. ప్లాస్మాను సేకరించిన తరువాత ఐసీఎంఆర్‌ ప్రతినిధుల సమక్షంలో అవసరమైన రోగులకు ఎక్కిస్తారు.

ఇదీ చూడండి:

'కమిటీ నివేదిక వచ్చే వరకూ పరిశ్రమ తెరిచేది లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.