ETV Bharat / state

నాపై నిఘా పెట్టారు.. అరెస్ట్ చేసేందుకు పోలీసులను ఉంచారు - ఎంపీ రఘురామ

author img

By

Published : Feb 27, 2022, 3:59 PM IST

mp raghu rama krishnam raju
mp raghu rama krishnam raju

mp raghurama: వైకాపా ప్రభుత్వంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. అధికార బలంతో ప్రతివారినీ దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మరోసారి తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.

mp raghurama: వైకాపా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించిన తనపై .. ముఖ్యమంత్రి జగన్ నిఘా పెట్టించారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. మరోసారి తనను అరెస్టు చేసేందుకు హైదరాబాద్‌లోని ఇంటి వద్ద మఫ్టీలో పోలీసులను పెట్టారన్నారు. పవన్‌ కల్యాణ్‌ సినిమా "భీమ్లానాయక్‌"ను దెబ్బతీసేందుకు కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన ప్రతి వారినీ అధికారం బలంగా దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్న ఆయన....తగిన సమయంలో గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు.

'వైకాపా అక్రమాలను ప్రశ్నించిన నాపై సీఎం నిఘా పెట్టించార. మరోసారి నన్ను అరెస్టు చేసేందుకు జగన్‌ యత్నించారు. పవన్‌ కల్యాణ్‌ సినిమా భీమ్లానాయక్‌ను దెబ్బతీసేందుకు కుట్రలు చేశారు. ప్రతి వారినీ దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు' - ఎంపీ రఘురామ

ఇదీ చదవండి

కక్ష సాధింపులు బాక్సాఫీస్‌ వద్ద ఎందుకు..? ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.