ETV Bharat / state

విద్యుదాఘాతంతో పూరిళ్లు దగ్ధం... రూ. 3 లక్షల ఆస్తి నష్టం

author img

By

Published : May 25, 2020, 3:05 PM IST

huts were shortcircuit and gets fire in krishna district
పూరిళ్లు దగ్ధం.... 3 లక్షలు ఆస్తి నష్టం

కొండిపర్రులో విద్యుదాఘాతం జరిగి మూడు పూరిళ్లు కాలిపోయాయి. పక్షవాతం బాధితుడైన ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండిపర్రులో విద్యుదాఘాతంతో 3 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో వ్యక్తికి గాయాలయ్యాయి. తెల్లవారుజామున మంటలు చెలరేగిన కారణంగా.. అక్కడ నివాసముంటున్న వారు పరుగులు తీశారు.

ఓ ఇంట్లో పక్షవాతంతో బాధపడుతున్న రోగి బయటకు రాలేక తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిని మచిలీపట్నం ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు చెప్పారు.

ఇదీ చదవండి:

విద్యుదాఘాతంతో గృహిణి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.